ఆపదలో ఆదుకున్న వోరగంటి యువసేన నాయకులు
ఇల్లంతకుంట మండలం రహీమ్ ఖాన్ పేట గ్రామానికి చెందిన పుషాల కనుకయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ దయనీయ స్థితిని గురించి వోరగంటి యువసేన నాయకులు తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి అంత్యక్రియల నిమిత్తం 5000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని యువసేన నాయకుల ద్వారా అందించి కుటుంబానికి అండగా ఉంటామని,మనో ధైర్యాన్ని నింపారు. గ్రామస్థులు వోరగంటి ఆనంద్ కి కృతజ్ఞతలు తెలిపి వోరగంటి యువసేన నాయకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వోరగంటి యువసేన నాయకులు, గ్రామపెద్దలు,స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments