ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: డిఎస్పీ నాగేంద్రచారి
• ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసుల ఫ్లాగ్ మార్చ్
న్యూస్ పవర్, 6 డిసెంబర్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు శని వారం సాయంత్రం ఇల్లంతకుంట మండలంలో మరియు కందికట్కూరు గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.
పంచాయితీ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు డిఎస్పీ తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు.ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు.మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ లో రూరల్ సి.ఐ మొగిలి, ఎస్.ఐ లు అశోక్, ఉపేంద్ర చారి ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
