ఇల్లంతకుంటలో రవాణా శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు
ఇల్లంతకుంట : మండలంలోని పలు గ్రామాలలో రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేశారు. తనిఖీలలో లారీ, ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎం వి ఐ వంశీధర్ తెలిపారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను రోడ్లపై తిప్పరాదని సూచించారు. తనిఖీలలో పిసి ప్రశాంత్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు
