మహిళలు అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తున్నారు

మహిళలు అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తున్నారు 

 న్యూస్ పవర్ , 8 మార్చి , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట : మహిళలు అన్ని రంగాలలో పురోభివృద్ధి సాధిస్తున్నారని ఎస్సై శ్రీకాంత్ గౌడ్, మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ లు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్ లో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. మహిళలు అక్షరాస్యులు అయినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రాధాన్య తీస్తుందన్నారు. మహిళలు వివక్షతకు గురైతే చట్టాలు రక్షణ కల్పిస్తాయన్నారు. సృష్టికి మూలాధారమైన మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడే సకల సంపదలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో విజేతలకు, పాల్గొన్న వారికి బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనిధిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments