• నిర్లక్ష్యానికి గురైన ఆ నాలుగు కాలువకు మరమ్మత్తులకు అంచనాలు సిద్దం చేయండి • నీటిపారుదలశాఖ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం
న్యూస్ పవర్ , 8 మార్చి , ఇల్లంతకుంట: పంటలు ఎండిపోకుండా గొలుసుకట్టు చెరువుల్లో నీరు నింపేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీటిపారుదశాఖ ఇంజినీర్లను ఆదేశించారు. శనివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇరిగేషన్ ఇంజనీర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతగిరి, మిడ్ మానేరు నది నుంచి విడుదలయ్యే నీటితో ఇల్లంతకుంట, గన్నేరువరం,బెజ్జంకి మండలాల్లోని గొలుసుకట్టు చెరువులను నింపాలని, ఈ దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంబంధిత అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని, రోజువారీగా పర్యటనలు చేస్తూ కాలువల వద్ద పరిస్థితిని సమీక్షించాలన్నారు. అంతే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన దాచారం, బోటిమీదిపల్లె, పెద్దలింగాపూర్, రామోజీపేట గ్రామాల కాలువ పనులు చేపట్టేందుకు వీలుగా అంచనాలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. అంచనాలు తయారవగానే నిధులు మంజూరు చేయిస్తానని ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, నీటిపారుదశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ వేణుబాబు, డీఈలు సీతారామరాజు,దేవేందర్, ఇల్లంతకుంట తహశీల్దార్ ఫారుఖ్త్ తోపాటు 10,11 ప్యాకేజీ సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments