పీఎం కిసాన్ సాయం రూపాయలు పదివేల పెంపు
PM Kisan increased by Rs.10,000
అన్నదాతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన సంవత్సర కానుకగా పిఎం కిసాన్ సామాన్ నిది సాయాన్ని రూపాయలు పదివేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు
2019 నుండి మోడీ సర్కార్ ఏటా రైతులకు 6000 పెట్టుబడి సాయం అందిస్తుంది 2000 రూపాయల చొప్పున మూడు విడతల్లో అన్నదాత ఖాతాల్లో జమ చేస్తున్నారు ఈ మొత్తాన్ని ఇప్పుడు పదివేలకు పెంచుతున్నారు ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు
రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10000 జమ చేస్తున్నట్లు ప్రకటించారు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాలు ఇప్పటికే పేర్కొన్నాయి
అయితే దానికన్నా ముందే ఆ మొత్తాన్ని 10 వేలకు పెంచుతున్నట్లు మంగళవారం ప్రధాని ప్రకటించారు
రైతులందరికీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆరేళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది రైతులకు పంట సహాయం కింద ఉపయోగపడుతుంది ఇప్పటికే కేంద్రం 18 వాయిదాలు రైతులకు చెల్లించింది
ఫిబ్రవరిలో 19వ వాయిదా కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రధానమంత్రి ప్రకటన వారిలో ఆనందాన్ని నింపింది.
0 Comments