• పెద్దలింగపూర్ గ్రామాలలో 800 ఎకరాలలో ఎండిన వరి పంట
• మండలంలో రెండు ప్రాజెక్టులు ఉన్న నీరు లేని పరిస్థితి
• ఎమ్మెల్యే కవ్వంపెల్లి.సత్యనారాయణ పంటలకు నీళ్లు ఇవ్వాలి లేదా నష్టపరిహారం అందించాలి
• యువజన సంఘాల నాయకుడు బెంద్రం తిరుపతి రెడ్డి
న్యూస్ పవర్, 11 మార్చి , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలంలో అంతగిరి, పెద్దలింగపూర్ గ్రామాలలో 800 ఎకరాలలో పంట పొలాలకు ఎండిపోయాయి , పెద్దలింగపూర్,గ్రామంలో నీళ్లు లేక ఎండిన వరి పంటలకు నిప్పు పెట్టిన రైతులను బేంద్రం తిరుపతిరెడ్డి ఓదార్చారు ఆయన మాట్లాడాతూ.. మా ఇల్లంతకుంట మండలంలో రెండు డ్యాములు వున్నా మా గ్రామాలలో పంటలకు నీళ్లు ఇవ్వకపోవడంతో బీటలు వారి పంటలు ఎండిపోయిన రైతులు ఎండిన పంట గడ్డి కూడా కోయడానికి ఖర్చులు అవుతు అప్పుల పాలవుతున్నామని అగ్గిపెట్ట కన్నీళ్లు పెట్టుకున్నారు, రైతులను రెండు రోజులలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణపరామర్శించి సహృదయంతో అలోచించి ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని, లేనిపక్షంలో కనీసం ఎండిపోయిన రైతుల పంటలకు ఎకరాకు 40000 వేల రూపాయలు నష్టపరిహార సహాయం అందించాలని కోరారు, ,రైతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ వరి పంట దహనాల నిరసనలలోఅమ్ముల అశోక్, అమ్ముల మహేష్, బండారి రవి, కదరా రాజు,కల్లూరి సురేష్, సలంద్రి పర్శరం, గంట మల్లేశ్, అరకుటి మల్లేష్,అరుకాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు .
0 Comments