JSON Variables

దివంగత నేత శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయం

 దివంగత నేత శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయం


•  ఎంపిపి వుట్కూరి వెంకట రమణారెడ్డి 

న్యూస్ పవర్, 2 మార్చి , ఇల్లంతకుంట :
 మంథని నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు దివంగత నేత స్వర్గీయ శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయంగా తెలంగాణ ప్రజలకు గుర్తుంటాయని,  ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరి వెంకట రమణారెడ్డి  అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మాజీ స్పీకర్ దివంగత నేత శ్రీపాద రావు 87వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
 ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివంగత నేత శ్రీపాద రావు  జయంతి ని అధికారికంగా నిర్వహించడం చాలా అభినందన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసమూర్తి ,ఎంపీటీసీలు వొగ్గునరసయ్య యాదవ్ ,తీగల పుష్పలత, కాతసుమలత మల్లేశం, సూర్య, టిఎ పుష్పలత,రవీందర్ రెడ్డి,మూడపెల్లి చందు, రజినీకాంత్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments