కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
• డప్పు చప్పులతో మహిళల నృత్యాలతో స్వాగతం పలికిన ఓగులాపూర్ గ్రామ ప్రజలు
• కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు వార్డు సభ్యులు, యువకులు,మహిళలు
• కండువా కప్పి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
న్యూస్ పవర్, 8 అక్టోబర్ , ఇల్లంతకుంట:
పల్లె పల్లెకు కాంగ్రెస్ గడపగడపకు కవ్వంపల్లి కార్యక్రమంలో భాగంగా నేడు ఓగులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను గ్రామ ప్రజలకు ఓటర్లకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ ప్రజలు యువకులు, మహిళా సోదరీమణులు రాజకీయ నాయకులు వివిధ పార్టీలకు చెందిన వారుసుమారు 300మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments