JSON Variables

ఎమ్మెల్యే నీ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతగిరి, వల్లంపట్ల దళితకాలనీల ప్రజానికం



ఎమ్మెల్యే నీ మర్యాదపూర్వకంగా కలిసిన అనంతగిరి, వల్లంపట్ల దళితకాలనీల ప్రజానికం

 న్యూస్ పవర్, 26 అక్టోబర్ , ఇల్లంతకుంట :
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీ ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు. వల్లంపట్ల దళిత కాలనీ మహిళలు ఎమ్మెల్యే ని కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్  మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి ₹10లక్షల సాయం చేస్తుందని పేర్కొన్నారు.
మూడవ సారి మానకొండూర్ ఎమ్మెల్యే గా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అనంతగిరి, వల్లంపట్ల దళిత నాయకులు, మహిళలు అన్నారు.

Post a Comment

0 Comments