JSON Variables

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి

 • ఢీజే లు పెడితే జైలుకే సిరిసిల్ల రూరల్ సిఐ. సదన్ కుమార్
• నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశాం ఎంపిడిఓ,తహశీల్దార్, ఎస్సై

న్యూస్ పవర్ , 26 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ.సదన్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు చోటుచేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ వినాయక విగ్రహాన్ని జియో టాగింగ్ చేయడం జరిగింది అని, గణేష్ ఉత్సవాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారి సూచనలు పాటించి సహకరించాలన్నారు.గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి డీజే లకు అనుమతి లేదని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ శాంతిభద్రతలకు విగుతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని యువతను కోరారు.ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఇల్లంతకుంట తహశీల్దార్, ఎంపిడిఓ, ఎస్సై చెప్పారు. పోలీసులు అన్ని గ్రామాల్లో ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహిస్తారని మండపాలను సందర్శిస్తారని వారికి సహకరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపిడిఓ, తహసీల్దార్, ఎస్సై, ఇల్లంతకుంట వినాయక మండపాల నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments