తైక్వాండోలో రాణించిన గణేష్
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థి ఎస్ పీ గణేష్ రాష్ట్రాస్థాయి తైక్వాండో పోటీలలో ద్వితీయ స్థానం సాధించాడు. వాణీనికేతన్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న గణేష్ వరంగల్ లో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో పాల్గొన్నాడు. తైక్వాండో లోని పూమ్స్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కవబరిచి ద్వితీయ స్థానంలో నిలిచాడు. పాఠశాల ఆవరణలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కరాటే మాస్టర్ చింతలతాడెం శరత్, ప్రతిభకనబర్చిన విద్యార్థి గణేష్ లను కరస్పాండెంట్ తూమకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధిలు అభినందించారు.
0 Comments