JSON Variables

ఎస్సీ కార్పోరేషన్ రుణాల్లో పెట్టుకున్న యూనిట్ నే మంజూరు చేయాలి

ఎస్సీ కార్పోరేషన్ రుణాల్లో పెట్టుకున్న యూనిట్ నే మంజూరు చేయాలి

న్యూస్ పవర్ , 11 ఆగస్టు , ఇల్లంతకుంట :
రాష్ట్రం లో గత ఆరు సంవత్సరాల నుండి ధరఖాస్తు చేసుకున్న అందరికి ఎస్సీ కార్పోరేషన్ రుణాలు మంజూరు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నిషాని రామచంద్రం  డిమాండ్ చేశారు . ఈ రోజు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా రేపాక లో మాట్లాడుతూ నిన్నటి రోజున ఇల్లంతకుంట మండలంలో ఎస్సీ కార్పోరేషన్ రుణాలకోసం ధరఖాస్తు చేసుకున్న వారిని పిలిచి యూనిట్ తో సంబంధం లేకుండా 50,000/- లేదా 1,00,000/- వరకే ఇస్తామని  అధికారులు ఒత్తిడి చేయడం సిగ్గుచేటని అన్నారు. స్థానిక శాసన సభ్యులు బాలకిషన్ కి , రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కి చిత్త శుద్ధి ఉంటే ధరఖాస్తు దారులకు పెట్టుకున్న యూనిట్ ని సబ్సీడీ తో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రుణాలు అందించకుండా కార్పోరేషన్ రుణాలను పక్కదారి పట్టించి లబ్ది దారులకు  ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అన్నారు. ఒకవేళ పెట్టుకున్న యూనిట్ ని మంజూరు చేయకుంటే మంత్రులను, ఎమ్మేల్యేలను గ్రామాల్లో వారి పర్యటనల్ని అడ్డుకోవాలి పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో జిల్లా ఇంచార్జ్ మంద బాలయ్య, మండల అధ్యక్షులు మాంకాళి అమర్, కొడాని దిలీప్ , కాసుపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .


Post a Comment

0 Comments