JSON Variables

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వోరగంటి
 న్యూస్ పవర్, 17జూలై , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన  లింగాని ప్రదీప్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు  వోరగంటి ఆనంద్  పరామర్శించారు ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉండే కుమారున్ని తల్లిదండ్రులు కోల్పోవడం వారికి తీరని లోటు అనీ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు,
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, అంబేడ్కర్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments