JSON Variables

అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టు సందర్శించిన కవ్వంపల్లి సత్యనారాయణ

అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టు సందర్శించిన కవ్వంపల్లి సత్యనారాయణ
జనం న్యూస్ , 29 జూలై,  ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రాజెక్టును కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ,  కాంగ్రెస్ నాయకులు సందర్శించారు,
గత నాలుగు రోజులు కురిసిన వర్షాలు వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు,
గత మూడు సంవత్సరాలుగా వర్షాలు కురిసిన ప్రతిసారి రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాకపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు,
అన్నపూర్ణ రిజర్వాయర్ వర్షాలకు ముందే నింపడంతో వర్షాల వల్ల వరద అధికంగా రావడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి చాలా రోడ్లు ద్వంసం అయిపోయి కల్వర్ట్ కూలిపోయి విద్యుత్ స్థంబాలు విరిగిపోయి తీవ్ర నష్టం జరిగిన ఇప్పటివరకు ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి రాలేదని రైతులు వాపోయారు,
దాదాపు రెండు కిలోమీటర్ల మేర రైతుల పొలాలను రోడ్లను పరిశీలించిన కవ్వంపల్లి సత్యనారాయణ  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే అధికారులను పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని కోరారు,
 ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు వల్ల రైతుల నష్టపోకుండా ఉండటానికి వారికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల వెంకటి, మాజీ సింగిల్ విండో చైర్మన్ రాఘవ రెడ్డి. మాజీ కిసాన్ సేల్ అధ్యక్షుడు పాశం రాజేందర్ రెడ్డి, మైనర్టీ అధ్యక్షడు జమాల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్, యసి సేల్ అధ్యక్షుడు రాజేశం,రజనీకాంత్, అంతగిరి, న్యాత బాబు, మామిడి నరేష్, బద్దం ఎల్లారెడ్డి, అన్నాడి సంపత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments