కథలపుర్ , మేడిపల్లి, రాయికల్, పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు
ఈ సందర్బంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు . రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు.అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూమ్ లో రికార్డ్స్ భద్రపరచుట, 5S అమలు తీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.
మెట్పల్లి డిఎస్పి రవీంద్రారెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు, కోరుట్ల సి.ఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు రామచంద్రరావు, సుధీర్ రావు, కిరణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments