JSON Variables

నష్టపోయిన పంటలకు ఎప్పుడూ సర్వే చేపిస్తారు.

నష్టపోయిన పంటలకు ఎప్పుడూ సర్వే చేపిస్తారు

న్యూస్ పవర్ , రాజన్న సిరిసిల్ల:
ఇల్లంతకుంట మండలంలో గత కోన్నిరోజుల క్రితం కురిసిన భారీ వడగళ్ల వర్షాలకు నష్టపోయినా పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షడు అంతగిరి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు, ఇప్పటివరకు కనీసం శాసనసభ్యుడు రసమయి బాలకిషన్  అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో వారికి రైతుల మీద ఉన్న ప్రేమ అర్థమైందన్నారు,వడగళ్ల వర్షనికి మండలంలో రైతులకు భారీ నష్టం జరిగిందన్నైరు. వ్యవసాయ అధికారులైనా కనీసం పంటపోలాలు,మామిడి తోటలను సందర్శించకపోవడం భాదకరం ఇప్పటికైనా సంబదిత అధాకారులను ఆదేశించి రైతులకు నష్టపరిహారం ఇవ్వలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో రైతులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఆందోళన చేస్తమన్నారు.



Post a Comment

0 Comments