JSON Variables

టిఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయాలి

టిఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయాలి 

న్యూస్ పవర్ , 19 మార్చి , ఇల్లంతకుంట :
 ఇల్లంతకుంట మండల  కేంద్రంలో స్థానిక రాజరాజేశ్వర గార్డెన్ లో మండల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన  మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అవునూరి రమకాంత్ హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. తదనంతరం రమాకాంత్ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తలు పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చాలని అదేవిధంగా టిఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటం చేయాలని సూచించారు. బిఅరెస్ పాలనలో  సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ప్రశ్నించే నాయకులను దాడుల పేరుతో, అరెస్ట్ లతో బెదిరింపులకు పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. బిఅరెస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరాలంటే బీజేపీ వల్లే సాధ్యం అన్నారు. మోడీ గారి పాలన లో దేశం సుబిక్షంగా విశ్వ గురువు గా ఎడిగింది అని, బిజెపి గెలిపించడం వల్లే దేశం రక్షించబడుతుంద‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ అసెంబ్లీ కో-కన్వీనర్ బత్తిని స్వామి, మండల ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్, వజ్జేపెల్లి శ్రీకాంత్, పట్టణ శాఖ తిప్పారపు శ్రవణ్,దొమ్మటి కిషోర్, కాత మల్లేశం,మాజీ మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి,బొల్లారం ప్రసన్న,చెప్యాల గంగాధర్,పున్ని సంపత్,గుంటి మహేష్, రజినీకాంత్,బోయిని రంజిత్,దేశెట్టి శ్రీనివాస్, పొన్నం కృష్ణ,అమ్ముల అశోక్, బద్దం ఎల్లారెడ్డి, ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి మరియు మండలంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments