కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎంపీపీ
కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయా గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి సంయుక్తంగా విజయవంతం చేయాలని ఎంపిపి వుట్కూరి వెంకట రమణారెడ్డి అన్నారు, సోమవారం తన కార్యాలయంలో అధికారులతో, మండల ప్రజా ప్రతినిధులతో, కలిసి కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 తేదీ నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరు దీనిని విజయవంతం చేయాలన్నారు, గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహిస్తారని, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లేదా, మహిళా సంఘ భవనాల వద్ద, కంటి పరీక్షలు చేసేందుకు సర్పంచులు ఎంపిటిసిలు నాయకులు కృషి చేయాలన్నారు, 100 రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సారథ్యంలో కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు, ప్రతి గ్రామంలో రోజువారిగా 250 మంది వరకు కంటి వెలుగులో భాగంగా పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు ప్రభుత్వ వైద్యులచే ఈ కంటి వెలుగు పరీక్షలను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీఓ మిర్జా, వైద్యాధికారిని శరణ్య ,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.
0 Comments