JSON Variables

ఆరోగ్య తెలంగాణ నే ప్రభుత్వ లక్ష్యం - వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

ఆరోగ్య తెలంగాణ నే ప్రభుత్వ లక్ష్యం -  వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్
 న్యూస్ పవర్, 3 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో మధుమేహం వ్యాధి ఉన్నవారికి ఎన్. సి.డి మందుల కిట్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి తో కలిసి ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు,
ఈ సందర్బంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ కై ప్రభుత్వం మధుమేహం వ్యాధి ఉన్న వారికి ఇంటి వద్దకే ఎన్. సి.డి మందుల కిట్ ని పంపిణీ చేస్తుంది అని అన్నారు, అధిక రక్తపోటు మరియు మధుమేహం నియంత్రణలో లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తదని అన్నారు, ప్రభుత్వం అందించే ఈ కిట్ ని మధుమేహం ఉన్నవారు డాక్టర్ గారు సూచించిన విధంగా మందులను క్రమం తప్పకుండా వాడాలని అన్నారు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలని కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట వెంకట్ రెడ్డి , ఏ. ఎన్. ఎం జ్యోతి , ఆశా కార్యకర్తలు విజయ , పద్మ , సౌమ్య , మరియు మధుమేహం వ్యాధి గ్రస్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments