JSON Variables

సహస్ర చండీ మహాయాగంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు


సహస్ర చండీ మహాయాగంలో పాల్గొన్న ఎంపీపీ దంపతులు

 న్యూస్ పవర్  , 30 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డి పల్లె శ్రీ రామలింగేశ్వర స్వామి  ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సహస్ర చండీ మహాయాగంలో ఆయన పాల్గొన్నారు, శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం సనాతన ధర్మం యొక్క విశిష్టతను వివరించారు .ఎంతో భక్తిశ్రద్ధలతో వ్యయ ప్రయాసలకు కోర్చి ఇంతవరకు మండలంలో ఎవరు చేయని విధంగా పెద్ద ఎత్తున సహస్ర మహా చండీ యాగాన్ని వేద పండితులు చెరుకు పవన్ శర్మ  నిర్వహించడం పట్ల అభినందించారు. చెరుకు పవన్ శర్మను ఎంపీపీ దంపతులు ప్రజాప్రతినిధులు తో కలిసి శాలువాతో జ్ఞాపకం అందజేసి సత్కరించారు. ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలోచనతో మంచి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినంద నీయమని పవన్ శర్మను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, సర్పంచ్ తుంకుంట శ్రీలత నరేందర్ రెడ్డి, సర్పంచులు చల్ల నారాయణ, జితేందర్ గౌడ్, నీల అంజయ్య  మనోహర్ రెడ్డి,బాబు, వెంకటేశం, ఓల్లాల మధు ,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments