JSON Variables

పీఎసెబి గురించి క్షేత్ర స్థాయి సందర్శన

పీఎసెబి  గురించి క్షేత్ర స్థాయి సందర్శన

 న్యూస్ పవర్ , 28 డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఈరోజు రేపాక క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారి రవళి రైతుల పొలం లో భాస్వరం ను కరిగించే జీవన ఎరువయిన పీఎసెబి  గురించి క్షేత్ర స్థాయి సందర్శన నిర్వహించడం జరిగింది.రైతుల వ్యవసాయ పొలం లో మొక్కకు లభ్యం కానీ రూపం లో నిరుపయోగంగా ఉన్న భాస్వరం, పీఎస్ బీ అనే జీవన ఎరువును వేయడం వలన కరిగి లభ్య రూపం లోకి మారి మొక్కలకు అందుబాటులో కి వస్తుందని సూచించారు.ఈ జీవన ఎరువు వాడడం వలన రసాయన ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలియ జేయడం జరిగింది.ఎకరాకు అర లీటర్ ద్రావణం పశువుల ఎరువు లో గాని,వర్మి కంపోస్ట్ లో గాని కలిపి భూమిలో నేరుగా వెదజల్లే విధానం లో వాడుకోవచ్చని సూచించారు.నేలలో తేమ ఉన్నపుడు దీనిని వాడుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చని వివరించారు. కార్యక్రమం లో నర్ర రమణ రెడ్డి,తోట మధుసూదన్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments