JSON Variables

ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంది శ్రీనివాస్ రెడ్డి

ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కంది శ్రీనివాస్ రెడ్డి 
 న్యూస్ పవర్, 2 డిసెంబర్ , ఇల్లంతకుంట :
ఆల్ ఇండియా రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామానికి చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి రెడ్డి కరుణాకర్ రెడ్డి నియామకపు ఉత్తర్వులు అందజేశారు,  ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం 5000 కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అదేవిధంగా రైతులకు ఏకకాలంలో రైతులందరికీ లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు మాఫీ చేయలేదని రైతు బీమా 59 నుండి 65 సంవత్సరాలు పెంచాలని రైతులందరికీ 50 సంవత్సరాలు నిండిన రైతులందరికీ  5000 రూపాలు పెన్షన్ ఇవ్వాలని   నెలకు 5000 రూపాయలు పించిని ఇవ్వాలని ప్రతి గ్రామంలో రెడ్డి కమ్యూనిటీ హా లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు , తనపై నమ్మకంతో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి రెడ్డి కరుణాకర్ రెడ్డి కి తన నియమాకానికి సహకరించిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎడవల్లి మధుసూదన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments