JSON Variables

తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన

 తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన
జనం న్యూస్, 24 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో  మండల పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి  మాట్లాడుతూ 2014 లో రైతులకు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఒక్కసారి కాకుండా ఆరు విడుతలలో చేయడం వల్ల రైతుల బ్యాంక్ వడ్డీలకె సరిపోయింది , 2018ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ నాలుగు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తున్నారు, ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్ల ఒత్తిడి తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు , ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు అనేక రకాల నష్టం జరుగుతున్న ప్రభుత్వం నష్ట పరిహారం అందించడం లేదు కనీసం పంట నష్ట వివరాలు కూడా సేకరించడం లేదు , భూ రికార్డల ప్రక్షాళన,ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది రైతుల రెవెన్యూ సమస్యలు పరిష్కారం కాక ఆత్మహత్య చేసుకుంటున్న ప్రభుత్వం స్పందించడం లేదు , కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దళితులకు,గిరిజనులకు వ్యవసాయం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుంది ,కౌలు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి వారికి న్యాయం చేయాలి , ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఐకేపీ సెంటర్ లో తూకం వేసిన తర్వాత మళ్ళీ మిలర్ల కూడా తరుగు పేరుతో కోత విధుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు , వీటన్నింటింపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారించాలి అని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో పసుల వెంకటి,, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు వినయ్ కుమార్ బీసీ సెల్ అధ్యక్షులు తట్ల వీరేశం యువజన అధ్యక్షుడు ఎర్రోజు సంతోష్ యువజన నాయకుడు జెట్టి మల్లేశం, ఉపాధ్యక్షుడు గూడ నరేందర్ రెడ్డి మండల సీనియర్ నాయకుడు బద్దం రమణారెడ్డి మండల కార్యదర్శి ఎలగందుల ప్రసాద్, టౌన్ అధ్యక్షుడు మామిడి నరేష్ మండల మహిళా అధ్యక్షురాలు అయ్యన్న గారి సత్యవతి ఎస్సీ సెల్ మండల అధ్యక్షురాలు గజ్జల కర్ణ,, తాళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఆదిరెడ్డి తిరుపతి గౌడ్ జిల్లా బీసీ సెల్ కార్యదర్శి నేరెళ్ల విజయ్ గాలి పెళ్లి గ్రామ శాఖ అధ్యక్షుడు మంజూరు ఎండి సురేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి గొల్ల కుంటి బాలయ్య తెలుగువారి పల్లె గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య జోహార్ పేట గ్రామ శాఖ అధ్యక్షులు కవ్వం పెళ్లి స్వామి దాసారం గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల నర్సింగ్ లింగారెడ్డి లక్ష్మారెడ్డి సుధాకర్ పరుశురాములు బాబు శంకర్ మధు శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments