ప్రతి ఇంటికి మీషన్ భగీరధద్వారా త్రాగు నీరందిస్తాం
-ఆర్ డబ్య్లూఎస్ అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించిన ఎంపిపి
న్యూస్ పవర్ , 19 నవంబర్ , ఇల్లంతకుంట :
మీషన్ భగీరద అధికారులతో ఎంపిపి వుట్కూరీ వెంకట రమణరెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ రవీందర్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో మీషన్ భగీరద పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టుతున్నట్లు తెలిపారు. దీని కోసం ప్రతి గ్రామంలో ఉన్న పాత పైప్ లైన్ తీసేసి మీషన్ భగీరధ పైప్ వేసేందుకు అంచన వేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయిలో అంచణ వేసి నివేదిక ఇవ్వాలని కోరారు, త్వరలోనే ఎమ్మెల్యే తో పనులను ప్రారంభించడం జరుగుతుందనీ, ప్రతి ఇంటికి నీరందిస్తామన్నారు. సర్పంచులు, ఎంపిటిసిలు ఆయా గ్రామాలలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ప్రతి ప్రాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ జానకీ, డీఈ ప్రేమ్ చందర్, ఎఈ రమేష్, ఎంపిఓ మీర్జా పాల్గొన్నారు.
0 Comments