JSON Variables

పట్ట పగలే దొంగతనం

పట్ట పగలే దొంగతనం

న్యూస్ పవర్, 14 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట - మండలకేంద్రానికి చెందిన కాసుపాక (మిద్దె) రాములు ఇంట్లో సోమవారం చోరీ జరిగినట్లు ఏఎస్సై మోతిరాం తెలిపారు. వివరాల్లోకి వెళితే కాసుపాక రాములు ఉదయం తన భార్యను తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా ఇదే అదునుగా తీసుకున్న దొంగలు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరు లేరని గ్రహించి దొంగతనానికి పాల్పడ్డారు. సాయంత్రం రాములు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు, బీరువా పగులగొట్టి అందులో ఉన్న 15 తులాల వెండి, అర తులం బంగారం, 28 వేల నగదు ఎత్తుకుని వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇట్టి సమాచారం అందుకున్న మండల ఏఎస్సై మోతీరాం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments