JSON Variables

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై దాడి హేయమైన చర్య - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి శ్రీనాథ్ గౌడ్

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై దాడి హేయమైన చర్య - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి శ్రీనాథ్ గౌడ్ 

 న్యూస్ పవర్ , 14 నవంబర్ , ఇల్లంతకుంట :
నిన్న గన్నేరువరం మండలం  గుండ్లపల్లె గ్రామంలో మానకొండూర్ శాసనసభ్యుడు రసమయి బాలకిషన్  పై కాంగ్రెస్ , బిజెపి నాయకులు చేసిన దాడి ని తీవ్రంగా ఖండించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్.. సోమవారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రసమయి బాలకిషన్  ప్రొద్దున లేచిన నుండి రాత్రి వరకు నిత్యం ప్రజల మధ్య లో ఉండే నాయకుడు అని అన్నారు.. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం పద్దతి కాదు అని అన్నారు.. ప్రజాసమస్యల పై నిత్యం ప్రజల మధ్య ఉండి సమస్యలను పరిష్కరిస్తున్న వ్యక్తి రసమయి  అని అన్నారు.. కాంగ్రెస్, బిజెపి నాయకులకు ఒకటే చెప్తున్నాం మేము ప్రతి దాడులు చేస్తే మీరు ఒక్కరు కూడా నియోజక వర్గంలో తిరగలేరు అని అన్నారు.. ఇప్పటికి అయిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బుద్ది తెచ్చుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో టి.ఆర్.ఎస్ నాయకులు దొమ్మాటి అనిల్ గౌడ్ , కొండ నరేష్ , బాలాజీ , తదితరులు పాల్గొన్నారు.




మరిన్ని లోకల్ వార్తల కోసం క్లిక్ చేయండి 


Post a Comment

0 Comments