గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు రాష్ట్ర సెమినార్ ను జయప్రదం చేయండి


 గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు - సవాళ్లు  రాష్ట్ర సెమినార్ ను జయప్రదం చేయండి

గన్నేరం నర్సయ్య వ్యవసాయ కార్మిక సంఘం    జిల్లా  కార్యదర్శి


 న్యూస్ పవర్ , 10 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఈరోజు అనంతరం గ్రామంలో కరపత్రం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15 న రవీంద్రభారతి, హైదరాబాద్ లో  వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో   ఈనెల 15న హైదరాబాదులో నిర్వహిస్తున్న రాష్ట్ర సెమినార్ ను జయప్రదం చేయాలని జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులతో కలసి బోయినపల్లి మండల కేంద్రంలో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ 2014 సంవత్సరం కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్ర చెస్తుందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కొటి ముప్పై లక్షలకు పైగా కూలీలు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించు కుంటున్నారని అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి నిధులు తగ్గిస్తూ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఆదాయము, ఆహార భద్రత కల్పిస్తున్నా చట్టాన్నె రద్దు చేసే కుట్రలకు పాల్పడుతుందని అన్నారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఐదు గంటలకు రెండుసార్లు కూలీలు పని ప్రదేశంలో ఫోటోలు దిగి అప్ లోడ్ చేయాలని, ఎండాకాలం ఎనిమిది గంటలు పనిచేయాలని, పని ప్రదేశాల్లో మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా, పెండింగ్ వేతనాలు చెల్లించకుండా, మెటీరియల్ పేమెంట్ ను పెంచి కూలీలను తగ్గిస్తూ పని భారం పెంచి, పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతూ ఉపాధి హామీ పనులకు కూలీలు రావద్దు అనే కుట్రలను కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించినారు. ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్న కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు వేతనము రూ.600 ఇవ్వాలని, మేట్లకు గుర్తింపు కార్డులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి, జీతభత్యాలు పెంచాలని కోరుతూ చట్ట పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సెమినార్ కు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి  మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు  ఎర్రబెల్లి దయాకర్ రావు , కేరళ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి మరియు లోకల్ బాడీస్ శాఖ మంత్రివర్యులు  ఎంబి రాజేష్ , అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ , తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు  పాల్గొంటున్నారని జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సెమినారును జయప్రదం చేయాలని  కోరారు. కార్యక్రమంలో నాయకులు రాములు కనకయ్య శ్రీనివాస్ లచ్చయ్య తిరుపతి శ్రీనివాస్ వెంకటేష్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments