JSON Variables

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలి -

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలి - ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ 

న్యూస్ పవర్ , 26 నవంబర్ , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో ప్రత్యేక ఓటరు సవరణ మరియు కొత్త ఓటరు నమోదు పోలింగ్ కేంద్రాన్ని శనివారం రోజున ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ పరిశీలించారు,

ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు.. మార్పులు , చేర్పులు కూడా చేసుకోవచ్చు అని అన్నారు.. ఓటరు నమోదు కార్యక్రమం ఈ రోజు , రేపు మరియు డిసెంబర్ 3 , 4 తేదీల్లో కూడా నమోదు కార్యక్రమం ఉంటుంది అని అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహించే తేదీల్లో బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు అని అన్నారు.. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు యామ రాజు , వసంత , మరియు నాయకులు దొమ్మాటి అనిల్ గౌడ్ , గణగోని రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments