JSON Variables

విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావద్దు



 న్యూస్ పవర్, 22 అక్టోబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో
పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పురస్కరించుకొని ఎస్సై మామిడి మహేందర్ ఆధ్వర్యంలో  ఈరోజు రహింఖాన్ పేట మోడల్ స్కూల్లో విద్యార్థులకు దేశ నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశంపై  వ్యాచారచన పోటీలు, సైబర్ క్రైమ్ పైన అవగాహన సదస్సు, మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాల పైన విద్యార్థులకు అవగాహన నిర్వహించడం జరిగినది,
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం పోలీసు వారోత్సవాలను పురస్కరించుకొని శ్రమదానం చేయాలి అని ఆదేశాలతో స్థానిక ఎస్సై మామిడి మహేందర్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను మూడు గంటల పాటు దగ్గర ఉండి మట్టి తెప్పిచ్చి గుంతలు పూడ్చివేసి రోడ్డు బాగు చేశారు.






Post a Comment

0 Comments