JSON Variables

దళిత బంధు వెంటనే అమలు చేయాలి

దళిత బంధు వెంటనే అమలు చేయాలి

బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్


న్యూస్ పవర్, 4 అక్టోబర్, ఇల్లంతకుంట :

రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దళిత బంధు అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బిజెపి దళిత మోర్చా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్ మాట్లాడుతూ ఎన్నికల కోసమే దళితులకు దళిత బంధు అందిస్తామని హామీలు ఇచ్చి మోసగించాడని అన్నారు. నేటికీ సరిగా ఏడాది అవుతున్నప్పటికీ  దళిత బంధు అందించలేదన్నారు. ఇప్పటికైనా మండలంలో అర్హులైన దళిత కుటుంబాలను గుర్తించి ప్రతి ఒక్కరికి దళిత బంధు అందించి వారి ఆర్థిక చేయూతను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షులు పున్ని సంపత్, దండవేని రజినీకాంత్,  బూత్ అధ్యక్షులు పయ్యావుల నవీన్, దళిత మోర్చా ఉపాధ్యక్షుడు మామిడి. శేఖర్, బిజెపి నాయకులు ముత్యం, ఇంతటి వేణు పొట్ల వెంకటేష్ ఎలుక వర్ధన్ మామిడి శ్రీకాంత్ దుర్ముట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments