JSON Variables

విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి



విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి


   న్యూస్ పవర్, 13 అక్టోబర్, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలoలోని రేపాక, సోమారం పేట, వెంకట్రావు పల్లె, గొల్లపల్లె గ్రామాల నుండి మండల కేంద్రము కు  విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని 
భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ మండల  కేంద్రంలో డిగ్రీ, ఇంటర్ విద్య నిమిత్తం 1OO మంది పైగా విద్యార్థులకు వస్తున్న పరిస్థితి. గతంలో 2018 సం"లో ఏస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పించాలని మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ధర్నా చేస్తే కరీంనగర్ డిపో బస్సు బెజ్జంకి నుండి ఇల్లంతకుంట వెయ్యటం జరిగింది కరోన సమయంలో అన్ని బంద్ కావటంతో ఈ బస్సు రావడం లేదు , విద్యార్థులు రోజు 50 రూపాయలు పెట్టుకొని ఆటోలో పోవాల్సిన పరిస్థితి ఉంది , సమయానికి బస్సులు లేకపోవటంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు , బస్సు లేకపోవటంతో పాఠశాల, కళాశాల కు వెళ్లేసరికి ఉదయం 11 అవుతుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళాలి అంటే 7,8 అవుతుంది అన్నారు. మండల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని పరిస్థితి. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా డిపో మేనేజ్మెంట్ కి కాల్ చేస్తే పట్టించుకోవటం లేదు అన్నారు. ఇప్పటికైనా రేపాక , సోమారం పేట, వెంకట్రావు పల్లె, గొల్లపల్లె విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యడల మండలంలోని అన్ని కళాశాలల విద్యార్థులను ఏకం చేసి ధర్నా, రాస్తారోకో లు చేపడుతం, డియెం ఆఫీస్ లు ముట్టడిస్తాం ఉద్యమం ఉద్రిక్తం చేస్తామన్నారు.

మరిన్ని లోకల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments