అందని ద్రాక్ష వలె డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు:నాగసముద్రాల సంతోష్
న్యూస్ పవర్, 27 సెప్టెంబర్, ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని నిరుపేదల కోసం ఇండ్లు కట్టిస్తామని గొప్పలు పలికి సంవత్సరాలు అవుతున్న ఆ నిరుపేదల కలలు నెరవేరడం వేర్చడం లేదన్నారు. ఈ పండుగకు అయిన తమ సొంతింటి కల నెరవేరేనా అంటూ నిరీక్షణగా చూస్తున్నారు. ఇల్లంతకుంట మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగి సంవత్సరములు అవుతున్న లబ్ధిదారులకు అందజేయడంలో జాప్యం చూపిస్తున్నారన్నారు, ఇది పూర్తిగా అధికార పార్టీ పాలకుల వైఫల్యం అన్నారు. కాగా డబుల్ బెడ్ రూమ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా నాణ్యత లోపం వల్ల డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చెందుతున్నాయన్నారు. లబ్ధిదారులకు అందించిన కూడా 80% వరకు మళ్లీ తిరిగి పనులు చేసుకోవాల్సి విధంగా ఇండ్ల నిర్మాణ పరిస్థితి ఉన్నదని పేర్కోన్నారు. ఇప్పటికైనా ఆధికార పార్టీ పాలకులు, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజా సమస్యల పట్ల వెంటనే స్పందించి వారి సమస్యల పరిష్కారానికి ముందుంటారని కోరుతూ అర్హులైన లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లో ఇళ్లు అందించే విధంగా చర్యలు చేపట్టాలని లేనియెడల లబ్ధిదారులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ వారికి అండగా నిలిచి ఇండ్ల పంపిణీ జరిపేంత వరకు పోరాడుతామని హెచ్చరిస్తున్నామన్నారు.
0 Comments