JSON Variables

గుండెపోటు తో ఒకరి మృతి

 రిపోర్టర్ వంగూరి దిలీప్   
ఈరోజు పోతుగల్ గ్రామంలో కోనింటి  రాములు అలియాస్ నల్లల రాములు గుండే పోటుతో మరణించడం జరిగింది.అతనికి భార్య బాలవ్వ(45), ముగ్గురు కుమార్తెలు శ్రావణి(22),శిరీష(20),మమత(15) మరియు ఒక కుమారుడు కార్తికేయ(12) ఉన్నారు వీరిలో శ్రావణి,శిరీష వివాహం చేయగా చేసిన అప్పులు తీర్చడం కోసం దిగులు చెందుతూ బ్రతుకుదేరువు కోసం గల్ఫ్ బాట పట్టిన వలస కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్ వెళ్లి అక్కడ పని లేకపోవడంతో గత నెల స్వగ్రామం తిరిగి వచ్చాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతు ఈరోజు ఉదయం 3:00 లకు గుండే పోటుతో మరణించడం జరిగింది. ఇలాంటి కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి ఆర్థిక సహాయం అందించాలని సర్పంచ్ గౌతంరావు, కాంగ్రెస్ పార్టీజిల్లాఉపాధ్యక్షుడు పెద్దిగారి శ్రీనివాస్, రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్, కొండ భానుచందర్, లు మాట్లాడుతు  మృతుని కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలని కోరారు

Post a Comment

0 Comments