JSON Variables

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
మంచిర్యాల జిల్లా// బెల్లంపల్లి పట్టణంలోబాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా సేవా ట్రస్ట్ వారి సహకారంతో బెల్లంపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ రోషిని పాండే గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నం బెల్లంపల్లి పట్టణంలో అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు మానసిక వికలాంగులకు,వృద్ధులకు,అనాథలకు,రోగులకు మరియు పేదవారికి అన్నదానం పంచినట్లు పేర్కొంటూ బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు. అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సేవా ట్రస్ట్ ఫౌండర్ కాంపల్లి శంకర్ గారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments