JSON Variables

తెరాస రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన - జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు


సిద్దిపేట జిల్లా: జనవరి12,(హుస్నాబాద్) తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యులు, తెరాస రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పిటిసీ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు కర్ర శ్రీహరి హైదరాబాద్ లో తన నివాసంలో ప్రమాద వశాత్తు మోకాలుకు దెబ్బ తగిలడం వల్ల గాయంతో  బాధపడుతున్నా వారు ఆపరేషన్ చికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు,మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భక్తుడు పిడిశెట్టి రాజు ఈరోజు ఎల్లమ్మ దేవాలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి, ఆహోరాత్రులు పోరాడిన గొప్ప మహనీయులు అని వారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజల కు మరింత సేవా చెయ్యాలని ,ఉన్నతమైన పదవిని పొందాలని  రాజు ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కర్ర శ్రీహరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments