Skip to main content

వ్యక్తి నిర్మాణం, శక్త ఆరాధన, ధర్మ జీవనమే ప్రపంచ శాంతి మార్గం

వ్యక్తి నిర్మాణం, శక్త ఆరాధన, ధర్మ జీవనమే ప్రపంచ శాంతి మార్గం

 న్యూస్ పవర్,1 అక్టోబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట లోని ఆర్యవైశ్య భవన్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయదశమి ఉత్సవం లో ముఖ్య వక్త కరినగర్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ మాటూరి లింగమూర్తి  మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 ఈ విజయదశమి రోజున ప్రారంభమైందని 2025 విజయదశమి నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నారు. విజయదశమి అనగానే అధర్మంపై ధర్మం గెలుపునకు గుర్తుగా కృతయుగంలో రావణాసురుడిపై రాముడు గెలుపొందింది, మరియు త్రేతాయుగంలో పాండవులు గెలుపొందిన రోజు కూడా ఇదే విజయదశమి అని, లోకానికి శాంతి మార్గం రావాలంటే ప్రతి ఒక్కరిలో శక్తి సముపర్జన చేయాలి అని, సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించాలని అందుకు ప్రతి ఒక్కరు ధర్మ మార్గాన్ని అనుసరించాలని అన్నారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజులలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతి గ్రామలలో శాఖలు మరియు జనజాగరణ, హిందూ సమ్మేళనాలు, యువకుల సమ్మేళనాలు, ప్రతిష్ట వ్యక్తుల సమ్మేళనాలు, కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరముల కాలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, తిరుమలలో ఏడుకొండలను, రామసేతును కాపాడుకోవడం లాంటివి అనేక విజయాలు సాధించాం అన్నారు. వరదలు, తుఫాను, భూకంప సమయాలలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహించడం, భారతదేశంతో పాకిస్తాన్, చైనా యుద్ధ సమయాలలో సైనికులకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సహకారం అందించారు అని తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఆర్ఎస్ఎస్ నిలబడింది అన్నారు. ఆర్ఎస్ఎస్ లో తయారైనటువంటి స్వయంసేవకులు అన్ని రంగాలలో పనిచేస్తున్నారని అన్నారు. పంచ పరివర్తన లో భాగంగా సామాజిక సమరసత ద్వారా సమాజంలో కుల,వర్గ, మత భేదం లేకుండా ఉండడం, పౌర విధులు నిర్వర్తించడం, స్వదేశీ వస్తువులను వినియోగించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, కుటుంబ విలువలను కాపాడుకోవడం, పాటించడం విషయాలను తెలియజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిథి చొప్పరి రామచంద్రం , ఖండ కార్యవాహా తాటిపల్లి మహేష్, వ్యవస్థ ప్రముఖ కాసుపాక కిషన్, సేవా ప్రముఖ్ బొల్లం ధనంజయ్, ఉపమండల ప్రముఖ్ సార శశికాంత్, నార్ల రాంకిషన్, ఈదుల రవీందర్ రెడ్డి, వివిధ గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...