వీధి దీపాల వితరణ
న్యూస్ పవర్ , 22 సెప్టెంబర్ , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి శ్రీనివాస్ కందికట్కూర్ గ్రామానికి సుమారు 100 వీధి దీపాలను, 4 హెవీ లైట్ల ను గ్రామనికి వితరణ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్నదే తన ఉద్దేశమని అన్నారు.గ్రామం మొదలయినా చోటు నుంచి మానేరు నది వరకు ఈ లైటింగ్ వ్యవస్థ ఉంటుందని అన్నారు.మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యత గా భావిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అమర్ గౌడ్ సీనియర్ నాయకులు రోషల్ గౌడ్, కాంగ్రెస్ నేతలు వెలిశాల శ్రీనివాస్, దొమ్మాట్టి భాగ్య దేవవ్వ లక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
