వరిధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లకు అనుమతి ఇవ్వాలి
• బీజేపీ మానకొండూరు అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి
న్యూస్ పవర్ , 12 మే , ఇల్లంతకుంట : వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయి మిల్లులకు తరలించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని...ఇటీవల రహీంఖాన్ పేట గ్రామంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కి సమస్య విన్నవించిన ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని బీజేపీ మానకొండూర్ అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి పేర్కొన్నారు. మరో పది రోజుల్లో రోహిణి కార్తె ప్రారంభం అవుతుందని...రైతులు నార్లు పోసుకునే టైం వచ్చిన యాసంగి పంట ఇంకా కల్లాల్లోనే ఉందని అన్నారు. లారీలు రాక, ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎక్కడికక్కడే ధాన్యం పెరుకుపోయిందన్నారు. వర్షం కురిస్తే ధాన్యం మొలకెత్తే ప్రమాదం ఉందని అధికారులు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ధాన్యం తరలించడానికి ట్రాక్టర్లకు అనుమతి ఇప్పించాలని... ధాన్యం తరలించడంలో నిర్లక్ష్యం చేస్తే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
0 Comments