గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసేయాలి
ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు, ఎమ్మార్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో ప్రస్తుతం ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అధికారం లోని రాగానే వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్నటువంటి మద్యం దుకాణాలు ( బెల్ట్ షాపులు ) మూసివేస్తానని హామీ ఇచ్చి పేద ప్రజల ఓట్లు దండుకొని చివరికి అధికారం లోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారు,బెల్ట్ షాప్ లు అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదన్నారు,గ్రామాల్లో మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఉండటం తో కూలి పనులు చేసుకుంటూ, కస్టపడి సంపాదించిన డబ్బులు కుటుంబాల అవసరం కోసం ఉపయోగించకుండా మద్యం కొరకు ఖర్చులు చేస్తు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ..రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ ఏకం చేసి,గ్రామాల్లో మద్యం దుకాణాలు బంద్ చేసేంతవరకు ఉద్యమ కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు..
0 Comments