వారంలో మూడు రోజులు ‘ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌



వారంలో మూడు రోజులు ‘ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌

• మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
• ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ కార్యక్రమం
• హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


 న్యూస్ పవర్ , 2 మే , ఇల్లంతకుంట :
ప్రతి వారంలో మూడు రోజులు ‘ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌’ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువగా ఉంటానని 
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలో ఎమ్మెల్యే ఆన్‌ విల్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, కలెక్టర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న క్షేత్ర స్థాయి సమస్యలను ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా,వాటిని తక్షణమే శాసనసభ్యుడు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిష్కరించారు.
అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. రీచ్ ది అన్ రీచ్డ్ అనే థీమ్ తో ఎమ్మెల్యే అన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ అనే యాప్‌ను తయారు చేయించి ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచామని, 
ఈ యాప్‌ను నియోజకవర్గంలోని 2.28 లక్షల మంది ఓటర్ల ఐడీకి అనుసంధానం చేయించామని వెల్లడించారు. ఓటర్లు తమ సమస్యలను నేరుగా ఈ యాప్‌లో అప్‌లోడ్‌ (నమోదు) చేసుకుంటే వాటిని అధికార బృందం పరిశీలించి పరిష్కరిస్తుందని వివరించారు. పరిష్కారాలను, ఇతరత్రా సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా ఆయా ఫిర్యాదుదారులకు పంపిస్తారాని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇంటి నుంచే తమ సమస్యను విన్నవించుకునే అవకాశం దాని స్టేటస్‌ తెలుసుకునే అవకాశం కల్పించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ అనే యాప్‌ను డిజైన్‌ చేసి యాప్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంచామని ఎమ్మెల్యే తెలిపారు. మండల స్ధాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా, రాష్ట్ర స్ధాయి అధికారులకు, అవసరమైతే సంబందిత మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పోలీస్, తదితర శాఖల పరిధిలో ప్రజలకు సమస్యలు ఉంటే తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతారం గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు వెంటనే నిధులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంజూరు చేశారు.
కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంలో మళ్లీ తిరిగి అసైన్ మెంట్ కమిటీల ద్వారా నిరుపేద ప్రజలకు భూమిని పంపిణీ చేసే సౌకర్యం ఉంటుందని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్లు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, పెన్షన్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి గ్యాస్ సబ్సిడీ, తదితర అంశాలపై ప్రజలు లేవనెత్తిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
కార్యక్రమంలో పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఫారుక్, ఎంపీడీఓ శశికళ, సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్, ఎంపీఓ శ్రీనివాస్, తదితర రెవెన్యూ, పంచాయితీరాజ్, సెస్ అధికారులు తదితరులు 
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఉట్కూరి రమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ పాక్స్ చైర్మన్ ఐరెడ్డి మహేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.



 

Post a Comment

0 Comments