కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు
• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి
 
 న్యూస్ పవర్, 14 మార్చి , ఇల్లంతకుంట :
 6 గ్యారంటీలు ,హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15 నెలలుగా ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ 
 పార్టీ నేతలపై అక్కసు వెల్లగక్కడంతో పాటు,డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ని సస్పెండ్ చేయడం కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని, ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కాలని చూస్తోందని ఇల్లంతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  పల్లె నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో నిన్నటి రోజు చీకటి రోజని, కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం యొక్క గొంతు కోసిందన్నారు.  అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు , అక్రమ అరెస్టులు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెన్షన్ గొంతు నొక్కడమని, జగదీశ్ రెడ్డి  ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు సస్పెండ్ చేస్తారాని ప్రశ్నించారు.  అసెంబ్లీలో ప్రజల సమస్యలపై మాట్లాడే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని, పథకం ప్రకారం ముందే అనుకొని బీఆర్ఎస్ సభ్యుని సస్పెండ్ చేశారన్నారు.  ప్రశ్నించే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను కుట్రపూరితంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, రాహుల్ గాంధీ మీరు చెప్పే ప్రజాస్వామ్య పరిరక్షణ ఇదేనా అన్నారు.   ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నదని పేర్కొన్నారు.  ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కి భంగపాటు తప్పదని హెచ్చరించారు.

Post a Comment

0 Comments