ప్రతి ఒక్క ఓటరు ఒక కాన్షీరాం లాగా వ్యవహరించాలి,
న్యూస్ పవర్, 10 మే , ఇల్లంతకుంట :
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు అమర్ మాట్లాడుతూ గతంలో కొన్ని పార్టీ లు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేయగా మాన్యశ్రీ కాన్షిరాం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ జన శక్తి ప్రదర్శన చేసి అప్పటి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని అప్పటి ప్రభుత్వాలు వెనిక్కి తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.ఇప్పుడు ప్రతి ఒక్క కాన్షిరామ్ విధానాన్ని అనుసరించి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు.అన్ని పార్టీలు కలిసి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాన్ని ప్రజలు ఓటుతో తిప్పి కొట్టాలని సూచించారు.బహు జన్ సమాజ్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మారేపల్లి మొగిలయ్య గారిని గెలిపించి రాజ్యాంగ సంరక్షణలో బలమివ్వాలని ఓటర్లను కోరడం జరిగింది.
0 Comments