JSON Variables

రైతులకు భూసార పరీక్ష పై అవగాహన

రైతులకు భూసార పరీక్ష పై అవగాహన
 న్యూస్ పవర్ , 22 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నాలుగవ రోజులో భాగంగా రైతులకు భూసార పరీక్ష పై అవగాహన కల్పిస్తూ మట్టి నమూనా ఎక్కడ ఎలా ఎప్పుడు తీసుకోవాలి మరియు వాటి యొక్క ఫలితాలు భూమి ఆరోగ్య కార్డులు ఎలా ఇస్తారో రైతులకు వివరించారు.
తరువాత అంగన్వాడీలో చిన్న పిల్లలకు,గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశ ప్రజల్లో ఎక్కువమంది బాధపడుతున్న రక్తహీనత పిల్లల్లో ఎదుగుదల లోపం మధుమేహం ఊబకాయం వంటి రుగ్మతలకు వరి మరియు గోధుమ ఆహార పదార్థాలు మూల కారణం వరి గోధుమల నుంచి జొన్నలు కొర్రలు వంటి చిరుధాన్యాల వైపు దృష్టి మళ్లిస్తే అనేక విధాలుగా మేలు జరుగుతుంది అని తెలియజేశారు.  ఇందులో భాగంగా చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు చేసి వాళ్లకు  చిరుధాన్యాల యొక్క పోషక గుణాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా||. టి అరుణ్ బాబు, శ్రీమతి కె.భవ్య శ్రీ,  విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments