అభివృద్ధి చూసి ఓటు వేయండి
• ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన రసమయి బాలకిషన్
న్యూస్ పవర్ , 10 నవంబర్ , ఇల్లంతకుంట :
ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది మానకోందూర్ నియోజక వర్గంలో నీ ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలను చుట్టేస్తూ బిజీ బిజీగా ప్రచారం చేస్తున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ మండలంలోని కంది కట్కూ ర్ రంగంపేట ,రహీం ఖాన్ పేట, వేల్జి పూర్ గూడెపు పల్లి, ఒబు లాపూర్, గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ప్రతి గ్రామ ములో ఎక్కువ నిధులు మంజూరు చేశామని, మిషన్ భగీర వాటర్,సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పైపులు ఇలా చాలావరకు పనులు పూర్తయ్యాయి ఇంకా మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేస్తామని అన్నారు ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ దేశానికే గర్వకారణం అని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని 24 గంటల కరెంటుతో మన బీడు భూములు సస్యశ్యామలమయ్యాయని మరొకసారి బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే కొత్త మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పార్టీకి అండగా ఉంటూ కారుగుర్తుకు ఓటు వేసి మరొక్కసారి ఆశీర్వదించాలి, అభివృద్ధిని కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పలు గ్రామాల సర్పంచులు, ఎం పి టి సి లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments