ఓటర్ కార్డు లేదా?
• ఈ 12 గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు వేయొచ్చు!
• కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
న్యూస్ పవర్ , 26 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి* తెలిపారు.
ఎన్నికల సిబ్బంది ఇంటింటా పంపిణీ చేసే ఫొటోతో కూడిన ఓటరు చీటీ కేవలం పోలింగ్ కేంద్రం, ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్యతో కూడిన సమాచారం కోసం మాత్రమేనని చెప్పారు.
ఓటు వేయడానికి వెళ్లే ముందు ఆ స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డు
లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏదో ఒకటి కిందు గుర్తింపు పత్రం చూపించాలన్నారు.
• ఓటరు గుర్తింపు కార్డు,
• ఆధార్కార్డు,
• ఎంఎన్ఆర్జీఏ జాబ్కార్డు
• పోస్టాఫీస్ లేదా బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్బుక్,
• కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు,
• డ్రైవింగ్ లైసెన్స్,
• పాన్కార్డు,
• ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డు,
• ఇండియన్ పాస్పోర్టు,
• ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్,
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు,
• ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం,
• దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు,
ఏదైనా ఒక గుర్తింపు కార్డులను తీసుకొని పోలింగ్ కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.
0 Comments