Skip to main content

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం 
 న్యూస్ పవర్, 9 జూన్ , ఇల్లంతకుంట :
పంటలకు కనీస మద్దతు ధర పెంపు,  మెడికల్ కాలేజీల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తదనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 మెడికల్‌ కళాశాలలను కేటాయించగా దీనిలో భాగంగా  కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో మెడికల్‌ కళాశాల మంజూరు చేయడం పట్ల బీజేపీ నాయకులు టాపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్  మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి పంట పెట్టుబడిపై 50 శాతం లాభం వచ్చేలా కనీస మద్దతు ధరను పెంచుతూ వస్తోందన్నారు. వరికి క్వింటాల్‌కు రూ.143 పెంచిందని.. ఈ నిర్ణయం వల్ల  రైతాంగానికి విశేష ప్రయోజనం చేకూరుతోందని వారు అభిప్రాయపడ్డారు. రైతులకు ఆర్థిక చేయూత అందించుటకు కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న  మోడీ ప్రభుత్వాన్ని కొనియాడారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైస్ మిల్లర్ల తో కుమ్మక్కై తరుగు పేరట 10 కిలోల వరకు తొలిగిస్తూ ధాన్యం కొనుగోలు జాప్యం చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని మరోసారి రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకాల మల్లేశం,బీజేపీ మండల ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రవణ్,  కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టి రెడ్డి లక్ష్మారెడ్డి,  కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రొండ్ల మధుసూదన్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లారం ప్రసన్న, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు పిట్టల అశ్విని, మహిళ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొలనూరు ముత్తక్క, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, శక్తి కేంద్రాల ఇంచార్జి పొన్నం కృష్ణ, లొంకోజు చంద్రం, సీనియర్ నాయకులు బత్తిని సాయి గౌడ్, చింతలపెల్లి రాజిరెడ్డి, చిమ్మనిగొట్టు శ్రీనివాస్, కట్కూరి తిరుపతి, పారిపెల్లి రాంరెడ్డి లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...