JSON Variables

దళితులపై వివక్ష చూపుతున్న కేసీఆర్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

దళితులపై వివక్ష చూపుతున్న కేసీఆర్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

న్యూస్ పవర్, 29జూన్ , ఇల్లంతకుంట:
వేల కోట్లు సంపాదించిన సినీ ప్రముఖులకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన సాయిచంద్ కు ఎందుకు జరుపలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపులలో డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.కేవలం దళితులైనందుకే సాయిచంద్, ఎమ్మెల్యే సాయన్న,గూడ అంజన్నలకు కేసీఆర్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుపలేదని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలనలో దళితుల చావులపై వివక్ష కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని హామీలు ఇచ్చి విస్మరించిన కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణలో బహుజన రాజ్యం సాధిద్దామని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments