JSON Variables

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి వినతిపత్రం ఇచ్చిన వివోఏలు

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి వినతిపత్రం ఇచ్చిన వివోఏలు

 న్యూస్ పవర్, 21 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ రోజు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఐకేపీ వివోఏలు తమ యొక్క సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు, తమ యొక్క సమస్యలను మంత్రి , సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపించాలని కోరారు ,  వీఓవోలకు కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, జీవో నం. 58ని సవరించాలన్నారు,  సంఘం అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ రూ.3 వేల వేతనంతో ఆర్థిక ఇబ్బందులు పడుతు న్నామన్నారు, ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు, 
ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ, పద్మ లత, భాలలక్ష్మి, రేణుక,అన్ని గ్రామాల వి ఓఏ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments