వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించుడే తప్ప పట్టించుకునే నాధుడే లేడు
- గన్నేరం నర్సయ్య సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు
న్యూస్ పవర్, 27 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రం ని సందర్శించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది కానీ 25 రోజులుగా ఎక్కడ కూడా కొనుగోలు చేయడం లేదని అన్నారు అలాగే అకాల వర్షానికి పంటలు పూర్తిగా దెబ్బ తినడం జరిగిందని రైతులకు తక్షణమే నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని వారికి మనోధైర్యం నింపడానికి ప్రజా ప్రతినిధులు పంటలు పరిశీలించి ఆదుకోవాలని అన్నారు పక్క నియోజకవర్గంలోని మంత్రులు హరీష్ రావు , గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ వరి పంట నష్టమైన పంట పొలాలను సందర్శిస్తూ రైతులకు మనోధైర్యం నింపడం జరుగుతుందని కానీ మన నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి నేటికీ పంటలు నష్టపోయిన ప్రదేశాలు సందర్శించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కొన్ని గ్రామాల్లో పంట నష్టం అంచన వేయమని అధికారులను కోరగా వెదర్ రిపోర్ట్ ప్రకారమే మేము అంచనా వేస్తామని అధికారులు అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని పంట పొలాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయాలని డిమాండ్ చేశారు అధికారులు తక్షణమే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో సామ నరసింహ రెడ్డి సావనపల్లి రాములు శ్రీనివాస్ ఎల్లయ్య ప్రభాకర్ చుక్కారెడ్డి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
0 Comments